యూపీలోని గోరఖ్పూర్ జిల్లా పిప్రైచ్ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఆదిత్య, సుమన్ నిషాద్లకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. సుమన్ తరచూ ఫోన్లో మాట్లాడేది. భర్త మందలించినా ఆమె మానలేదు. కుటుంబమంతా బుధియా మాయి ఆలయానికి వెళ్లారు. అక్కడ సుమన్ ప్రియుడు తన స్నేహితులతో వచ్చి ఆదిత్యను కొట్టారు. అనంతరం ఆదిత్య కళ్ల ముందే సుమన్ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.