గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలింజిన్

79பார்த்தது
గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలింజిన్
యూపీలోని రాయ్‌బరేలీలో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. NTPCకి చెందిన ఉంచహార్ ప్రాజెక్ట్ ప్లాంట్ ప్రాంతంలో గూడ్స్ రైలు బొగ్గు అన్‌లోడ్ చేసేందుకు వచ్చింది. తిరిగి వెళ్తున్న క్రమంలో దానికి ఎదురుగా అదే ట్రాక్‌పై ఓ రైలింజిన్ వచ్చింది. వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలింజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி