ఊరూరా తిరుగుతూ సర్కస్ చేసే ఓ వ్యక్తి కొండచిలువను మెడకు వేసుకుని ఆడిస్తుండగా అది బిగుసుకుని ఊపిరాడక మరణించాడు. ఝార్ఖండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జంషెడ్పుర్కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొండచిలువను మెడకు వేసుకుని ఆడిస్తుండగా, అది అతడి మెడను గట్టిగా నులిమేసింది. దీంతో ఊపిరాడక ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హేమంత్ సింగ్గా గుర్తించారు.