సినీ నటుడు అల్లు అర్జున్పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని ఆర్వో ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, నంద్యాల
వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా, తన స్నేహితుడు శిల్ప రవిచంద్రకు మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల వచ్చారు. ఈ క్రమంలో అభిమానులు,
వైసీపీ కార్యకర్తలు శిల్పా ఇంటికి భారీగా తరలి వచ్చారు.