గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. వారిలో 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కూటమి సర్కార్ సూచించినా APPSC మాత్రం యథావిధిగా నిర్వహించింది.