తెలంగాణ ప్రతిపక్ష పార్టీ BRSకు త్వరలో భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. 15 మంది BRS కార్పొరేటర్లు త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. గ్రేటర్లోని 15 మంది BRS కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారు త్వరలోనే కాంగ్రెస్లో జాయిన్ అవుతారు బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు.