హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. ఆమె పేరుతో పార్శిల్లో 5 కిలోల దుస్తులు, 7 నకిలీ పాస్పోర్టులు, 5 ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, 960 గ్రాముల కొకైన్ వచ్చిందని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని.. బ్యాంకు ఖాతా వెరిఫై చేయాలని వివరాలన్నీ సేకరించారు. ఆ తర్వాత బాధితురాలి ఖాతా నుంచి రూ.14.73 లక్షలు కాజేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.