Mar 31, 2025, 15:03 IST/
HCU భూముల వ్యవహారం.. ఇద్దరు అరెస్ట్
Mar 31, 2025, 15:03 IST
హైదరాబాద్లోని HCU భూముల వ్యవహారంలో ఆందోళన చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హెచ్సీయూ విద్యార్థులు కాకుండా మరో ఇద్దరు ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తించామని మాదాపూర్ డీసీపీ తెలిపారు. విద్యార్థులు కాని రోహిత్ కుమార్, ఎర్రం నవీన్లను అరెస్ట్ చేశామని చెప్పారు. హెచ్సీయూలో ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదని స్పష్టం చేశారు. విద్యార్థులను హాస్టల్ నుంచి లాక్కువచ్చారని వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఇద్దరు అరెస్ట్