மண்ணாரை - Mannarai Census Town

కామారెడ్డి జిల్లా
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
Jul 13, 2024, 01:07 IST/కామారెడ్డి
కామారెడ్డి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

Jul 13, 2024, 01:07 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో అతని అవయవాలను దానం చేశారు. ఇలాంటి ఘటన భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మెట్టు నవీన్ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గల ఒక బేకరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత నాలుగు రోజుల క్రితం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా పట్టణ శివారులో ప్రమాదానికి గురై కోమలోకి వెళ్లిపోయారు. వెంటనే గమనించి ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్న తరుణంలోనే ఆయన మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.