రామాలయం రథానికి నిప్పు.. వైసీపీ నేత అరెస్ట్

79பார்த்தது
రామాలయం రథానికి నిప్పు.. వైసీపీ నేత అరెస్ట్
అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్‌లో రామాలయం రథం దగ్ధం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. రథానికి నిప్పు పెట్టిన నిందితుడ్ని అరెస్ట్ చేశామని ఎస్పీ జగదీష్ తాజాగా వెల్లడించారు. ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ నేత రథానికి పెట్రోల్ పోసి నిప్పటించారని తెలిపారు. రథం దగ్ధం వెనుక ఇంకెవరైనా ఉన్నారో అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కాగా, రూ.20 లక్షల ఖర్చు చేసి ఎర్రి స్వామి కుటుంబం రథాన్ని తయారు చేయించారు.

தொடர்புடைய செய்தி