మార్కాపురం: వరలక్ష్మీ రూపంలో అమ్మవారు

52பார்த்தது
మార్కాపురం: వరలక్ష్మీ రూపంలో అమ్మవారు
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం దసరా నవరాత్రులలో 8వ రోజు ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మవారు వరలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వరలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. పూజలు నిర్వహించి అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி