వర్షపు నీటితో మునిగిన పంట పొలాలు

55பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు రెండు రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. ఎడతెలిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి రహదారులపైనే కాకుండా పంట పొలాల్లో కూడా వర్షపు నీరు చేరింది మార్కాపురం మండలంలోని వేములకోట నికరంపల్లి చింతకుంట తిప్పాయపాలెం జమ్మనపల్లి గ్రామ పొలాలలోకి వర్షపు నీరు చేరాయి. పత్తి, కంది పంటలు మునిగాయి. మరికొన్ని చోట్ల నీరు నిలిచి పంట ఉరకలెత్తే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி