ప్రకాశం జిల్లా గిద్దలూరు లో దాతల సహకారంతో వరద బాధితులకు పదివేల వాటర్ బాటిలను సమకూర్చినట్లు గిద్దలూరు ఎమ్మార్వో ఆంజనేయ రెడ్డి గురువారం తెలిపారు. ఓ వాహనంలో పదివేల వాటర్ బాటిల్ లను విజయవాడకు వరద బాధితుల కోసం పంపిస్తున్నామని చెప్పారు. వరద బాధితులకు అండగా నిలుస్తున్న దాతలకు ఎమ్మార్వో ఆంజనేయ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.