కార్లలో వచ్చి పొట్టేళ్లు చోరీ

60பார்த்தது
కార్లలో వచ్చి పొట్టేళ్లు చోరీ
పెద్దదోర్నాలలో పొట్టేళ్లు అపహరణకు గురయ్యాయి. ఎల్లయ్య, ఖాసిం పీరా రైతులకు చెందిన 10 పొట్టేళ్లు స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో ఉంచారు. శనివారం అర్ధరాత్రి పొట్టేళ్లు అపహరించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా 2 కార్లల్లో వచ్చిన దొంగలు పొట్టేళ్లు చోరీ చేసినట్లుగా గుర్తించారు.

தொடர்புடைய செய்தி