మార్కాపురం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

61பார்த்தது
మార్కాపురం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి గ్రామ సమీపంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కృపాకర్ అనే వ్యక్తిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కంభం పట్టణానికి చెందిన వెంకట సాయి కృష్ణ(26)గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி