కొండేపి: వేలం కేంద్రంలో ముగిసిన కొనుగోళ్లు

81பார்த்தது
కొండేపి: వేలం కేంద్రంలో ముగిసిన కొనుగోళ్లు
ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు వేలం కేంద్రంలో 2023-24 పంటకాలానికి సంబంధించి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందని నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. మొత్తం 164 రోజుల పాటు రూ. 471 కోట్ల వేలం జరిగిందని 1, 43, 191 పొగాకు బేళ్లు కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు. పొగాకు గరిష్ట ధర రూ. 362 సరాసరి ధర రూ. 272. 85 పలికిందని కొనుగోళ్లు పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி