అధికారులతో సమావేశమైన ప్రత్యేక అధికారి

63பார்த்தது
అధికారులతో సమావేశమైన ప్రత్యేక అధికారి
వెలిగండ్ల ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే. అర్జున్ నాయక్ మండల స్థాయి అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. జిల్లాలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన మండలంలో పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

தொடர்புடைய செய்தி