రహదారులపై గోవులను వదిలేస్తే చర్యలు

56பார்த்தது
రహదారులపై గోవులను వదిలేస్తే చర్యలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో రహదారులపై గోవులను వదిలేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై నరసింహారావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆవుల యజమానులు వాటిని కట్టేసుకోవాలని సూచించారు. రహదారులపై వదిలేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. యజమానులు గోవులను రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకోకపోతే వాటిని గోశాలకు లేదా వేరే సుదూర ప్రాంతాలకు తరలిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி