పల్నాడు జిల్లాలో దళిత పల్లెలపై దాడులను ఖండించండి

77பார்த்தது
పల్నాడు జిల్లాలో దళిత పల్లెలపై దాడులను ఖండించండి
పల్నాడు జిల్లాలో దళిత పల్లెల ప్రజలపై అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు రాజ్యాంగానికి వ్యతిరేకమని కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె. కృష్ణ తెలిపారు. బాధిత గ్రామాల ప్రజలు సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెదకూరపాడు మండలంలోని లగడపాడులో గత నెల 9న వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా అగ్రకుల వారు ఎస్సీ మాదిగ యువకులపై దాడికి పాల్పడ్డారు.

தொடர்புடைய செய்தி