తాడికొండలో పాముకాటుతో వృద్ధుడి మృతి

61பார்த்தது
తాడికొండలో పాముకాటుతో వృద్ధుడి మృతి
పాముకాటుతో వృద్ధుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడికొండ పోలీసుల వివరాల మేరకు పొన్నెకల్లు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు(58) ఈ నెల 1వ తేదీన పశువుల మేత కోసం పొలానికి వెళ్లగా గడ్డి పొదల్లో ఉన్న విష సర్పంపై కాలు వేశాడు. దీంతో కుడి కాలుపై పాము కాటు వేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆదివారం కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி