ఇసుక సరఫరా పెంచేందుకు 108 కొత్త రీచ్లు: సీఎం చంద్రబాబు

79பார்த்தது
ఇసుక సరఫరా పెంచేందుకు 108 కొత్త రీచ్లు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖపై సీఎం వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సమీక్ష చేశారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం 70లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త ఇసుక రీచ్లు అందుబాటులో వస్తాయని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி