కాకుమాను వెలుగు ప్రాజెక్ట్ అధికారిణిగా సుజాత నియామకం..

63பார்த்தது
కాకుమాను వెలుగు ప్రాజెక్ట్ అధికారిణిగా సుజాత నియామకం..
గుంటూరు జిల్లా కాకుమాను మండలం వెలుగు ప్రాజెక్ట్ అధికారిణిగా సుజాత సోమవారం కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా ఫిరంగిపురం వెలుగు ప్రాజెక్టు నుంచి కాకుమానుకు బదిలీ అయినట్లు ఆమె మీడియాకు తెలిపారు. మండలంలో డ్వాక్రా సంఘాల బలోపేతానికి కృషిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி