స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నూరు శాతం అమలు చేయాలి: కమిషనర్

55பார்த்தது
స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నూరు శాతం అమలు చేయాలి: కమిషనర్
ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని పొన్నూరు పట్టణంలో నూరు శాతం అమలు చేయాలని కమిషనర్ రమేష్ బాబు అన్నారు. ఆదివారం పట్టణంలో 21, 22, 30, 31 వార్డులలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అబ్దుల్ కలాం బస్టాండ్ వెనుక డ్రైనేజీ నీరు రోడ్డుపై పారటంతో సచివాలయ శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహించారు.

தொடர்புடைய செய்தி