పెదకూరపాడు:100కు పైగా ఇసుక రీచ్ లలో తవ్వకాలు: ఎమ్మెల్యే ప్రవీణ్

67பார்த்தது
పెదకూరపాడు:100కు పైగా ఇసుక రీచ్ లలో తవ్వకాలు: ఎమ్మెల్యే ప్రవీణ్
అక్టోబర్ 16 నుంచి రాష్ట్రంలోని వందకు పైగా ఇసుక రీచ్ లలో తవ్వకాలు ప్రారంభమవుతాయని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు జరుపకూడదని, కాదని జరిపితే నీటి రీఛార్జి జరగదని, తద్వారా భూగర్భ జలాల కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. అందుకే ఇసుక తవ్వకాలకు విరామం ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

தொடர்புடைய செய்தி