రైలు ఢీకొని వృద్ధుడి మృతి

53பார்த்தது
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన నడికూడి జంక్షన్ లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చెన్నై సూపర్ ఫాస్టు ఎక్స్ప్రెస్ నడికూడి స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు 60 - 65 మధ్య ఉంటుందని తెల్లచొక్కా, తెల్ల లుంగీ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி