రెండు రోజులు కొండవీడు ఘాట్ రోడ్డుకు రాకపోకలు బంద్..

72பார்த்தது
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కొండవీడు ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడిన దృష్ట్యా, కొండవీడు నగరవనం సందర్శన కోసం సోమ, మంగళవారాలు మూసివేయ బడుతుంది అని ఆదివారం జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు తెలిపారు. ఘాట్ రోడ్డుపై పడిన బండరాళ్లను ఆర్ అండ్ బీ శాఖ సహకారంతో తొలగిస్తామన్నారు. తదనంతరం సందర్శకులకు అనుమతి ఉంటుందని, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி