మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహణ

62பார்த்தது
మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహణ
కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శనివారం మండల స్థాయిలో విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, బ్యాట్మెంటన్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్ ఖాజావలి మాట్లాడుతూ రెండు రోజుల పాటు మండల స్థాయిలో ఆయా పోటీలకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పీఈటీలు జ్వాలా లక్ష్మి, సురేష్, కళ్యాణి, శ్రీనివాసరావు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி