ఏపీలో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు నగదు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి రూ.2,730 కోట్ల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి అందించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శనివారం పాల్గొంటారు.