భూమన, వైవీ సుబ్బారెడ్డి నాశనం మొదలైంది: పవన్
By Rathod 77பார்த்ததுటీటీడీ మాజీ చైర్మెన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నాశనం మొదలైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో మంగళవారం పవన్ మాట్లాడుతూ.. లడ్డూ పవిత్రతపై భూమన వ్యంగ్యంగా మాట్లాడారని, అతని నాశనం మొదలైందన్నారు. విజిలెన్స్ విచారణకు వైవీని పిలిస్తే రికార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని పవన్ చెప్పారు. జగన్ హయాంలో తిరుమలను ఇష్ట్యారాజ్యంగా చేశారని పవన్ మండిపడ్డారు.