రైతులు ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి

71பார்த்தது
ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటలకు ఈ - క్రాప్ బుకింగ్ చేసుకోవాలని దర్శి మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ గురువారం రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట వేసిన ప్రతి రైతు ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవాలన్నారు. లేదంటే ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర, సున్నా వడ్డీ తదితర ప్రభుత్వ పథకాలు వర్తించవన్నారు. సమీప ఆర్ బి కే కేంద్రాలకు వెళ్లి ఈ-క్రాప్ బుక్ చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி