నరసరావుపేట: ఫ్యాన్ కు ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

70பார்த்தது
నరసరావుపేట: ఫ్యాన్ కు ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం నరసరావుపేటలో జరిగింది. ఆమె మృతికి భర్త కుటుంబ సభ్యుల వేధింపులే కారణమంటూ మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం. తెలంగాణకు చెందిన సౌజన్య (25)కు నరసరావుపేటకు చెందిన ఆర్లగడ్డ ఏసుబాబుతో వివాహమైంది. ఈ క్రమంలో సౌజన్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.

தொடர்புடைய செய்தி