మాచర్ల: బీసీ కుల జనగణనపై మహాధర్నా

59பார்த்தது
నేడు బీసీ కుల జనగణనపై విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు బుధవారం పల్నాడు జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఇన్ చార్జ్ సైదులు యాదవ్ తెలిపారు. పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు మాచర్ల నియోజకవర్గం నుంచి సుమారు 10 వాహనాలలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళుతున్నట్లు చెప్పారు. బీసీ కుల జనగణనపై తమ పార్టీ పోరాడుతోందన్నారు. బీసీలంతా ఏకమై ధర్నాను విజయవంతం చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி