గుంటూరు: కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయండి

76பார்த்தது
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు. గుంటూరు ఏసీ కళాశాల సమీపంలోని రాష్ట్ర గ్రంథాలయంలో బుధవారం పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమాన్ని నసీర్ ప్రారంభించి, పట్టభద్రులతో ఓటర్ దరఖాస్తు చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி