AP: సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఆదాయార్జన శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదైనట్టు వెల్లడించారు. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన అభివృద్ధి అని అన్నారు. అలాగే పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయ లక్ష్యం రూ.1.37 లక్షల కోట్ల సాధనపై అందరూ దృష్టి పెట్టాలంటూ పేర్కొన్నారు.