భార్య, అత్తమామలతో విసిగిపోయిన సందీప్ కుమార్ (36) అనే యువకుడు గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని మొరాదాబాద్లో ఈ ఘటన జరిగింది. తన మరణానికి భార్య నీలం, కొంతమంది బంధువులను బాధ్యులుగా పేర్కొంటూ ఆత్మహత్యకు ముందు సందీప్ ఒక వీడియోను రికార్డు చేశాడు. ఆ వీడియోలో "నేను ఎంత ప్రయత్నించినా నా భార్య, పిల్లల హృదయాలను గెలుచుకోలేకపోయాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీరు సంతోషంగా ఉండండి" అని చెప్పాడు.