వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలపై అధికారులతో రివ్యూ చేసినట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. 8 జిల్లాలలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందని మంత్రి తెలిపారు. వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని మంత్రి సూచించారు. అధికారులందరూ ఫీల్డ్లో ఉండి పరిస్థితులను సమీక్షించాలన్నారు.