రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

85பார்த்தது
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ వద్దకు వెళ్లి తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி