శ్రీచండిక అమ్మవారికి అక్షయ తృతీయ సందర్భంగా అలంకరణ

58பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రం లోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ చండిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా అమ్మ వారికి అభిషేకం, అలంకరణ, నైవేద్యం అనంతరం హారతి సమర్పించారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు అమ్మవారి ఆశీర్వచనంతో పాటు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.

தொடர்புடைய செய்தி