జాతీయ సేవ పథకంపై అవగాహన సదస్సు

83பார்த்தது
జాతీయ సేవ పథకంపై అవగాహన సదస్సు
నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో జాతీయ సేవ పథకంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యకత వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ మన కళాశాలలో రెండు యన్‌ఎస్‌ఎస్ యూనిట్స్ ఉన్నాయన్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఈ జాతీయ సేవ పథకంలో నమోదు చేసుకొని తద్వారా యన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా వాలంటీర్లు క్రమశిక్షణ, న్యాయకత్వ లక్షణాలు పెంచుకొని సామాజిక సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி