కబడ్డీ అసోసియేషన్ కొత్తగూడ మండల కమిటీ ఎన్నిక

78பார்த்தது
కబడ్డీ అసోసియేషన్ కొత్తగూడ మండల కమిటీ ఎన్నిక
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అజ్మీర రమేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ఈసీ సభ్యుడిగా చీరాల రామ్ చరణ్ తేజ్ ఎన్నికయ్యారు. అన్ని గ్రామాల్లో కబడ్డీ క్రీడను ప్రోత్సహించేందుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని అధ్యక్షుడు రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటిని పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி