బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత బుధవారం మహబూబాబాద్ పట్టణంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలిస్తే పొంగిపోయేది, ఓడిపోతే కృంగిపోయేది లేదని అన్నారు. గెలిచిన అభ్యర్థులు ప్రజల అభివృద్ధికి పాటుపడాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.