'గో బ్యాక్ ఫార్మా".. అంటూ రైతుల నిరసన

53பார்த்தது
'గో బ్యాక్ ఫార్మా".. అంటూ రైతుల నిరసన
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ వద్దంటూ పోలేపల్లి, లగ చర్ల, హకీంపేట గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు నిరసన తెలిపారు. పోలేపల్లి ఎల్లమ్మ దేవత ఆలయానికి ర్యాలీగా చేరుకొని నిరసన తెలిపారు. 'గో బ్యాక్ ఫార్మా". అంటూ నినాదాలు చేశారు. ఫార్మా సిటీ కంపెనీలు ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி