రేపు జమ్మూకశ్మీర్ రెండో విడత ఎన్నికలు

73பார்த்தது
రేపు జమ్మూకశ్మీర్ రెండో విడత ఎన్నికలు
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, బీజేపీ జమ్మూకశ్మీర్‌ చీఫ్ రవీందర్ రైనా సహా పలువురు కీలక నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు. పోలింగ్ దృష్ట్యా రాజౌరీ సహా పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி