ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం వెల్లడించింది. ఆగస్టు- సెప్టెంబర్ మధ్య అనుకూల లానినో పరిస్థితులతో భారత్లో సాధారణం కంటే అధికంగానే వర్షాలు పడతాయని ఇప్పటికే భావిస్తుండగా తాజా అంచనాలు వాటిని మరింత బలపరుస్తున్నాయి.