సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు

84பார்த்தது
సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు
మహారాష్ట్రలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఫూణెలో శివాజీ నగర్‌ ప్రాంతంలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదంతో తమ్ముడు, అతని భార్య తన సోదరి సకీనా ఖాన్ (48)ని హత్య చేశారు. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. అయితే ఆగస్టు 26న ఖరాడి ప్రాంతంలోని ముఠా నది ఒడ్డున పోలీసులకు ఓ మహిళ మృతదేహం లభ్యమవ్వగా.. విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி