మద్యం పాలసీ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ కేజ్రీవాల్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు

59பார்த்தது
మద్యం పాలసీ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ కేజ్రీవాల్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు
మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి దాదాపు 6 నెలలుగా జైలు జీవితం గడిపిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. నేడు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే 10లక్షల పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు విధించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టులో జరిగే విచారణలకు హాజరుకావాలని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం, అధికారికంగా సంతకాలు చేయడంతో పాటు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.

தொடர்புடைய செய்தி