వాల్యూ గోల్డ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన సినీ నటి అనసూయ

75482பார்த்தது
వాల్యూ గోల్డ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన సినీ నటి అనసూయ
బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ VALUE GOLD అని సినీ నటి అనసూయ అన్నారు. నేడు హైదరాబాద్ లో VALUE GOLD వారి మొబైల్ వాహనాన్ని ముఖ్యఅతిథిగా హాజరై Caps గోల్డ్ డైరెక్టర్ అభిషేక్ చంద్ర,అఖిల్ చంద్ర, సీఈఓ భరద్వాజ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సినీ నటి అనసూయ బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించిన మొదటి సంస్థ వాల్యూ గోల్డ్ అని అనసూయ కొనియాడారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడుదల చేయించడం వీరి ప్రత్యేకత అని, తెలంగాణలోని మొట్టమొదటిసారిగా బంగారం కొనుగోలు చేసే వాహనాన్ని వాల్యూ గోల్డ్ సంస్థ తయారు చేసిందన్నారు. కస్టమర్లు తమ బంగారాన్ని తీసుకువచ్చి నాణ్యత పరీక్ష చేయించి అధిక విలువ కోసం కరిగించి తక్షణమే డబ్బును పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారనీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించి మార్కెట్ రేటుకి కొని లాభం పొందే లాగా చేస్తున్నారన్నారు. వాల్యూ గోల్డ్ వాహన సేవలను కరీంనగర్ జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నారనీ ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జూన్ 24-27 నాడు కరీంనగర్ రెవిన్యూ గార్డెన్ లో, జూన్ 28-29 పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో, జూలై 1-3 హుజురాబాద్ గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్ లో, జూలై 4-5 సిరిసిల్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో, జూలై 6-8 సిద్దిపేట మున్నూరు కాపు సంక్షేమ సంఘం వద్ద ఈ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி