కోదాడ మండలం తహసీల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వాజిద్ అలీని కోదాడ తెలంగాణా స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోషియన్ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. మండలలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మండలాన్ని ఆదర్శ మండలంగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జాకీర్ పాషా, సూర్యాపేట జిల్లా కార్యదర్శి జాఫర్, ఖాజామియా, ముక్తార్, జబ్బార్, షఫీ, గఫార్ పాల్గొన్నారు.