లక్కవరంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి

790பார்த்தது
లక్కవరంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి
అనంతగిరి మండలం లక్కవరం గ్రామంలో రామాలయంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో 12 మంది స్వాములు మాలలు ధరించి 40 రోజులు భక్తితో పూజలు నిర్వహించి ఈ రోజు ఇరుముడి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి హాజరై స్వాములందరికి పూలమాలలు వేసి ఆశీర్వాదం పొందారు. అదేవిధంగా సర్పంచ్ కూరపాటి భూపతి, ఉపసర్పంచ్ కబీర్ సాహెబ్, మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ బుర్ర నర్సిరెడ్డీ, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி