యూపీలోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు యోగి సర్కారు రూ.25 లక్షలపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రస్తుత మహాకుంభమేళా 144 ఏళ్ల తర్వాత జరుగుతోందనే అంశాన్నీ ప్రశ్నించిన మమతా బెనర్జీ.. దీని వెనకున్న కచ్చితత్వాన్ని నిర్ధరించాలని సంబంధిత నిపుణులకు విజ్ఞప్తి చేశారు.