అటవీ అమరవీరులకు జోహార్లు: జిల్లా కలెక్టర్

66பார்த்தது
అటవీ అమరవీరులకు జోహార్లు: జిల్లా కలెక్టర్
అటవీ అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులర్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. అలాగే అటవీ శాఖ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி